దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో సర్పంచ్ కొడుకు!

by Satheesh |
దారుణం: మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో సర్పంచ్ కొడుకు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మైనర్ బాలికలపై లైంగిక దాడులు ఆగడం లేదు. మైనర్ బాలికలు ఒంటరిగా కనబడితే చాలు కామాంధులు కాటేస్తున్నారు. బలవంతంగా అనుభవించడం.. ఒప్పుకోకపోతే ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి దారుణ ఘటనలు తరచూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి కూతవేటు దూరంలో తాడేపల్లిలో దివ్యాంగురాలిని లైంగిక వేధింపులకు పాల్పడగా.. ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో ఆ యువకుడు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఘటన మరువకముందే డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన మైనర్ బాలికను ఎత్తుకెళ్లి ఐదుగురు మానవ మృగాలు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈనెల 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే కాట్రేనికోన మండలం చిర్రయానం గ్రామానికి చెందిన మైనర్ బాలిక ఈనెల 6న ఈలతోటల వద్ద మంచి నీళ్ల కోసం వెళ్తుంది. ఆమె రాకను గమనించిన ఐదుగురు కామాంధులు ఆమెను ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేశారు.

తనను వదిలేయమని ఎంత మెుత్తుకున్నా కనికరించలేదు. ఒకరి తరువాత ఒకరు కామవాంఛ తీర్చుకున్నారు. అనంతరం బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఎవరికైనా చెప్తే చంపేస్తామని హెచ్చరించారు. అనంతరం కోలుకున్న ఆ బాలిక ఇంటికి వెళ్లి జరిగిన దారుణం గురించి తెలిపింది. అయితే ఈ లైంగిక దాడికి పాల్పడిన వారిలో వైసీపీ సర్పంచ్ కుమారుడు సైతం ఉన్నారు. సర్పంచ్ కుమారుడుతో పాటు మరో నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులకు అధికార పార్టీకి చెందిన నాయకులు బాధిత కుటుంబానికి డబ్బులు ఇచ్చి తప్పు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.

లక్షరూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించారు. అయినప్పటికీ బాలిక తల్లిదండ్రులు లొంగలేదు. తమ బిడ్డకు వచ్చిన పరిస్థితి మరెవరికీ రాకూడదని ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అమలాపురం డీఎస్పీ వై మాధవరెడ్డి, కాంట్రేనికోన ఎస్ఐ పి శ్రీనివాస్‌లు విచారణ చేపట్టారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.

Next Story

Most Viewed