భవనం పై నుంచి పడి మేస్త్రి మృతి

by Kalyani |
భవనం పై నుంచి పడి మేస్త్రి మృతి
X

దిశ, కూకట్ పల్లి: నిర్మాణ పనులు చేస్తూ భవనం పై నుంచి పడి మేస్త్రి మృతి చెందిన సంఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి కుత్బుల్లాపూర్ సర్కిల్ పద్మా నగర్ ఫేస్1 లో చోటు చేసుకుంది. పద్మానగర్ ఫేస్1 అపార్ట్మెంట్ లో నిర్మాణ పనులలో మేస్త్రి గా పనిచేస్తున్న మధ్యప్రదేశ్ కు చెందిన కమలేష్ (43) ప్రమాదవశాత్తూ 5 వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. తీవ్ర గాయాల పాలయ్యాడు, స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి వచ్చిన 108 సిబ్బంది కమలేష్ ను పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి మృత దేహాన్ని గాంధీకి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed