AP News:స్నేహితుల మధ్య ఘర్షణ.. గాజు సీసాతో దాడి

by Jakkula Mamatha |
AP News:స్నేహితుల మధ్య ఘర్షణ.. గాజు సీసాతో దాడి
X

దిశ ప్రతినిధి,ఎన్టీఆర్ జిల్లా:విజయవాడ గొల్లపూడిలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. భవానీపురం పోలీసుల వివరాల ప్రకారం.. ఇద్దరు స్నేహితుల మధ్య శుక్రవారం ఘర్షణ జరిగింది. గోవింద్ అనే యువకుడు సాయి పై గాజు సీసాతో దాడి చేశాడని తెలిపారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సాయికి తీవ్ర రక్తస్రావం మేడపైన బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాధితుడు కంచికచర్ల పట్టణానికి చెందిన చరణ్ గా గుర్తింపు రక్తసిక్తంగా ఉన్న యువకులను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story

Most Viewed