అప్పుడే పుట్టిన బిడ్డను రెండంతస్తుల భవనం పై నుంచి విసిరేసిన 15 ఏళ్ల బాలిక

by Mahesh |   ( Updated:2022-12-14 02:59:31.0  )
అప్పుడే పుట్టిన బిడ్డను రెండంతస్తుల భవనం పై నుంచి విసిరేసిన 15 ఏళ్ల బాలిక
X

దిశ, వెబ్‌డెస్క్: 15 ఏళ్ల బాలిక తనకు అప్పుడే పుట్టిన పసిబిడ్డని రెండంతస్తుల భవనం పై నుంచి విసిరేసి చంపేసింది. ఈ హృదయవిదారక సంఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. కాగా ఆ బాలిక ఇలా చేయడానికి కారణం తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. పోలీసుల సమాచారం ప్రకారం.. తాను ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో పక్కనే ఉంటున్న వ్యక్తి తన ఇంట్లో తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు తెలిపినట్లు సమాచారం. కాగా బాలిక వాంగ్మూలం ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడని గుర్తించి అతన్ని విచారిస్తున్నట్లు తెలిపారు.

Read More...

వైశాలి కిడ్నాప్ కేసు: నవీన్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

Advertisement

Next Story

Most Viewed