నిజాయితీకి నిదర్శనం… సున్నం రాజయ్య

by  |
నిజాయితీకి నిదర్శనం… సున్నం రాజయ్య
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య జీవితం అందరికీ ఆదర్శనీయమని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తూర్పు గోదావ‌రి జిల్లా వీఆర్.పురం మండలం సున్నంవారిగూడెంలో సున్నం రాజయ్య కుటుంబ సభ్యులను తమ్మినేని ఇతర నేతలతో కలిసి పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) పార్టీ ఉద్యమంలో రాజయ్యతో కలిసి పనిచేసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

మారుమూల గిరిజన గ్రామంలో జన్మించిన సున్నం రాజయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని అన్నారు. ప్రభుత్వాల నుంచి ఆఫర్ వచ్చినా, తిరస్కరించి పార్టీని వీడకుండా ఎర్ర జెండా నీడలో మరణించడం సున్నం రాజయ్య నిజాయితీకి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, తదిత‌రులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed