కొవిడ్ ఆస్పత్రి పై నుంచి దూకిన మహిళ

by  |
కొవిడ్ ఆస్పత్రి పై నుంచి దూకిన మహిళ
X

దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ ఆస్పత్రి భవనం పై నుంచి మహిళా పేషెంట్ దూకిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని కోవిడ్ ఆస్పత్రిలో చల్లపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఓ మహిళ కరోనా చికిత్స పొందుతున్నది. ప్రస్తుతం ఆమె కరోనా నుంచి కోలుకుంది.

ఈ సందర్భంలో ఆమెను ఆస్పత్రి నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. కానీ, కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆస్పత్రి భవనం పై నుంచి దూకింది. దీంతో ఆ పేషెంట్ కు తీవ్ర గాయాలయ్యాయి.


Next Story

Most Viewed