నాగర్‌ కర్నూల్‌లో మరో పాజిటివ్

by vinod kumar |
నాగర్‌ కర్నూల్‌లో మరో పాజిటివ్
X

దిశ, మహబూబ్ నగర్: ఇన్నిరోజులు జీహెచ్‌ఎంసీకే పరిమితమైన కరోనా వైరస్ క్రమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వ్యాప్తి చెందుతోంది. తాజాగా నాగర్ కర్నూల్‌ జిల్లాలో మరో పాజిటివ్ కేసు నిర్దారణ అయ్యింది.ఈ ఘటనతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో ఓ మహిళకు కరోనా టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యులు వెల్లడించారు. అంతకు ముందు అదే మహిళ కిడ్నీవ్యాధితో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చేరింది. విషయం తెలుసుకున్న వైద్యాధికారులు ప్రస్తుతం శ్రీనగర్ కాలనీలో ఆమె ప్రైమరీ కాంటక్ట్స్‌కు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed