తెలంగాణలో కరోనా డీటెయిల్స్

by vinod kumar |
తెలంగాణలో కరోనా డీటెయిల్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోన్నది. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. మంగళవారం ఒక్కరోజే 71 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో జీహెచ్ఎంసీ పరిధిలో 38, వలస కూలీలు 12, విదేశాల నుంచి వచ్చినవారిలో 4, రంగారెడ్డి జిల్లాలో 7, మేడ్చల్ జిల్లాలో 6, సూర్యాపేట, వికారాబాద్, నల్లగొండ, నారాయణపేట్ లో ఒకరికి చొప్పున కరోనా సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,991 కు చేరుకోగా, ఇందులో 120 మంది గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్ అయ్యారు. కాగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 1284 కు చేరుకుంది. ఇంకా 650 మంది బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా కరోనా సోకి మంగళవారం ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం మృతుల సంఖ్య 57 కు చేరుకుంది.

Advertisement

Next Story