ఏపీలో 6లక్షల 25వేలు దాటిన కేసులు

by  |
ఏపీలో 6లక్షల 25వేలు దాటిన కేసులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 70,455మందికి పరీక్షలు నిర్వహించగా 7,738మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6లక్షల 25వేల 514కి చేరింది. 57మరణాలు సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 5,359గా ఉంది. ప్రస్తుతం 78,836యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు చికిత్స తీసుకొని 5లక్షల 41,319మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా 10,608 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 51లక్షల 4వేల 131మందికి పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం తెలిపింది.

కరోనా మహమ్మారి బారిన పడి కృష్ణా జిల్లాలో 8మంది ప్రాణాలు కోల్పోగా, అనంతపురంలో ఏడుగురు, చిత్తూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, విశాఖలో ఆరుగురు, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, కర్నూలులో నలుగురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లాలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,260 కరోనా కేసులు నమోదు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో 1,005, ప్రకాశంలో 869, చిత్తూరులో 794, గుంటూరులో 582, అనంతపురంలో 539, శ్రీకాకుళంలో 476, నెల్లూరులో 444, విజయనగరంలో 446, కృష్ణాలో 439, విశాఖలో 342, కర్నూలులో 275, కడపలో 267 పాజిటివ్ కేసులు వచ్చినట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ వెల్లడించింది.


Next Story

Most Viewed