కాసేపట్లో ఢిల్లీ బయల్దేరనున్న సీఎం జగన్

by srinivas |
కాసేపట్లో ఢిల్లీ బయల్దేరనున్న సీఎం జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో అపాయింట్‌మెంట్ ఖరారు కావడంతో సోమవారం సాయంత్రం ఢిల్లీ ఫ్లైట్ ఎక్కనున్నారు. ప్రధానితో సమావేశం సందర్భంగా ప్రధానంగా రాష్ట్రానికి రావల్సిన నిధులు, జీఎస్టీ బకాయిలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం మరో విధమైన చర్చ నడుస్తోంది. ఎన్డీయేలో వైసీపీ చేరబోతుందని, కేంద్ర కేబినెట్ పదవుల విషయంపై చర్చించేందుకే సడన్‌గా జగన్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారని అనుకుంటున్నారు. వారం రోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో రెండ్రోజుల్లో రెండుసార్లు సమావేశమైన సీఎం జగన్… మళ్లీ ప్రధాని మోడీతో భేటీ కానుండటం చర్చనీయాంశంగా మారింది.

Next Story

Most Viewed