త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయండి

by Shyam |
త్వరగా ధాన్యం కొనుగోళ్లు పూర్తిచేయండి
X

దిశ, నల్లగొండ: ధాన్యం కొనుగోళ్లను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని కొనుగోలుదారులకు జిల్లా అడిషనల్ కలెక్టర్ సంజీవరెడ్డి సూచించారు. సోమవారం ఐకేపీ, రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అనంతరం నాగారం మండల కేంద్రంలోని ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి కల్లెంలోని వడ్లను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సమయంలో రైతులను ఇబ్బందులకు గురిచేసిన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అడిషనల్ కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీకాంత్, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

tags: rice purchasing center, clear early, additional collector sanjeeva reddy

Advertisement

Next Story