ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా.. హైప్ పెంచేస్తున్న హీరో పోస్ట్

by Kavitha |
ఓటీటీలో దుమ్మురేపుతోన్న సినిమా.. హైప్ పెంచేస్తున్న హీరో పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఎస్ జే సూర్య విలన్‌గా నటించారు. కాగా ఈ చిత్రం ఆగస్టు 29న వరల్డ్ వైడ్‌గా విడుదలై రూ.100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ సాధించింది. ఇదిలా ఉంటే, సెప్టెంబర్ 26 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ చిత్రం OTT ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ దేశ వ్యాప్తంగా నెంబర్ 1లో ట్రెండ్ అవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను నాని పోస్ట్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ అయింది. ఇక దీనిని చూసిన నాని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సాలీడ్ మ్యూజిక్‌ను అందించారు.


Advertisement

Next Story

Most Viewed