- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
గుడ్ న్యూస్ అంటూ ఆ విషయం చెప్పిన అక్కినేని కోడలు.. అసలు విషయం తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు

దిశ, సినిమా: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ(Shobitha Dhulipala) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. ఇక ఈ బ్యూటీ వ్యక్తిగత విషయానికి వస్తే.. అక్కినేని హీరో నాగ చైతన్య సమంత(Samantha)తో విడాకులు తీసుకున్న తర్వాత అతనితో ప్రేమలో పడింది. అంతేకాకుండా చైతన్యతో చెట్టాపట్టాలేసుకుని వేకెషన్స్, హోటల్స్కి కూడా వెళ్లింది.
అయితే ఆ ఫొటోస్ కాస్తా నెట్టింట బయటపడడంతో వీరి ప్రేమ వ్యవహారం బయటకు వచ్చింది. కానీ వీరిద్దరూ ఆ విషయంపై స్పందించలేదు. కానీ డైరెక్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుని బిగ్ షాక్ ఇచ్చారు. ఆ తర్వాత రీసెంట్గా మ్యారేజ్ చేసుకుని ఒక్కటయ్యారు. ఇక అప్పటినుంచి తన భర్తతో పాటు అక్కినేని కోడలు స్టేటస్ను ఎంజాయ్ చేస్తుంది శోభిత. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social media)లో యాక్టీవ్గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. తాజాగా శోభిత తన ఇన్స్టా గ్రామ్ వేదికగా గుడ్ న్యూస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది. అందులో తాను నటించిన ‘ది నైట్ మేనేజర్’ మూవీ రిలీజ్ అయి 2 ఇయర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్లు తెలియజేసింది. అలాగే హీరో ఆదిత్యరాయ్ కపూర్ను మేము మిస్ అవుతలేము ఎందుకంటే అతను పెయింటింగ్ రూపంలో మా వెనకే ఉన్నాడు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు ప్రగ్నెంట్ అనే విషయం చెబుతుందనుకుంటే సినిమా గురించి చెప్పి షాక్ ఇచ్చిందిగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.