ఏపీలో ముందస్తు ఎన్నికలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

by srinivas |
ఏపీలో ముందస్తు ఎన్నికలు.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. ముందస్తు ఎన్నికలు తథ్యం అంటూ చెప్పుకొచ్చారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని ధీమా వ్యక్తం చేశారు. రెండున్నరేళ్ళ కంటే ముందే టీడీపీ అధికారంలోకి రాబోతుందంటూ జోస్యం చెప్పుకొచ్చారు. కుప్పం నుంచే టీడీపీ విజయదుందుభిని కొనసాగిద్దామంటూ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story

Most Viewed