బంపర్ ఆఫర్ ప్రకటించిన విస్తారా ఎయిర్ లైన్స్

by M.Rajitha |
బంపర్ ఆఫర్ ప్రకటించిన విస్తారా ఎయిర్ లైన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ ఎయిర్ లైన్స్ విస్తారా విమాన టికెట్లపై బంపర్ ఆఫర్ ప్రకటించింది. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లోని ఎకానమీ నుండి బిజినెస్ క్లాస్ వరకు ఈ ధరలు వర్తించనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ నేపథ్యంలో బాగ్డోగ్రా నుండి డిబ్రూఘర్ వెళ్ళే ప్యాసింజర్ ఎకానమీ టికెట్స్ రూ.1578 కి, ముంబై నుండి అహ్మదాబాద్ వెళ్ళే ప్యాసింజర్ ప్రీమియం ఎకానమీ టికెట్స్ రూ. 2678 కి, బిజినెస్ క్లాస్ రూ. 9978 కి పొందవచ్చునని తెలిపింది. డిల్లీ నుండి ఖాట్మండు విమానాల ఎకానమీ క్లాస్ కోసం అన్ని ఛార్జీలతో కలిపి రూ. 11,978 మాత్రమే అని పేర్కొంది. అయితే ఈ సేవలు ముందుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తాయని విస్తారా ఎయిర్ లైన్స్ షరతు విధించింది.

Next Story

Most Viewed