IPO: స్టాక్ మార్కెట్ సెన్సేషన్‌గా నిలిచిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీఓ

by S Gopi |
IPO: స్టాక్ మార్కెట్ సెన్సేషన్‌గా నిలిచిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మార్కెట్లలో అనేక కంపెనీలు ఐపీఓల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. వాటిలో కొన్ని కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరుస్తాయి, మరికొన్ని భారీ లాభాలను తెచ్చిపెడతాయి. తాజాగా ఓ కంపెనీ భారీగా సబ్‌స్క్రైబ్ కావడమే కాకుండా వ్యాపార నిర్వహణ వివరాల్లో అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఢిల్లీకి చెందిన ఈ కంపెనీ ఎవరికీ పెద్దగా తెలియకపోవడం విశేషం. తక్కువ ప్రచారంలో ఉండి అనూహ్యంగా స్టాక్ మార్కెట్ సెన్సేషన్‌గా నిలిచిన ఆ కంపెనీయే రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్. స్మాల్ మీడియా ఎంటర్‌ప్రైజ్(ఎస్ఎంఈ) విభాగంలో ఐపీఓకు వచ్చిన ఈ కంపెనీ కేవలం రూ. 12 కోట్ల నిధుల సమీకరణకు మాత్రమే సిద్ధమైంది. కానీ, పెట్టుబడిదారులను ఆకట్టుకుని 419 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇన్వెస్టర్ల నుంచి రూ. 4,800 కోట్ల విలువైన బిడ్లు కంపెనీకి వచ్చాయి. ఈ కంపెనీకి కేవలం రెండు షోరూమ్‌లు, 8 మంది మాత్రమే ఉద్యోగులు ఉండటం గమనార్హం. 2018లో ప్రారంభమైన ఈ కంపెనీ సాహ్నీ ఆటోమొబైల్ బ్రాండ్ ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. యమహా బ్రాండ్ డీలర్‌షిప్‌ను కలిగిన కంపెనీ మోటార్‌సైకిల్, స్కూటర్ల అమ్మకాలు, సేవలను అందిస్తోంది. కొత్తగా మరో రెండు షూరూమ్‌ల ఏర్పాటు, అప్పులు, నిర్వహణ ఖర్చుల కోసం ఐపీఓ నిధులను వినియోగించనున్నట్టు పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed