ప్రయాణికులకు షాక్.. ఆగని పెట్రో బాదుడు

by Rajesh |
ప్రయాణికులకు షాక్.. ఆగని పెట్రో బాదుడు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఇంధన బాదుడు కొనసాగుతోంది. గత మూడు రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం కూడా మళ్లీ పెట్రోల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై 57 పైసలు, డీజిల్ పై 60 పైసలు పెరిగింది. ఈ పెంపుతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.112.37, డీజిల్ రూ.98.70గా ఉంది. అటు ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.11గా ఉండగా.. డీజిల్ రూ.90.42గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed