Jio News: జియో కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్.. ముకేష్ అంబానీ సంచలన ప్రకటన

by Shiva |   ( Updated:2024-08-29 09:54:09.0  )
Jio News: జియో కస్టమర్లకు భారీ గుడ్ న్యూస్.. ముకేష్ అంబానీ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రంగంలో గత ఎనమిదేళ్లుగా జెట్ స్పీడ్‌తో దూసుకెళ్తున్న జియో కస్టమర్లకు భారీ శుభవార్త చెప్పింది. ఈ మేరకు తమ కస్టమర్లకు ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించింది. త్వరలో దీపావళి కానుకగా ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని ఇవ్వబోతున్నట్లు ఆ కంపెనీ యజమాని ముకేష్ అంబానీ వెల్లడించారు. జియో ఫైబర్ రిమోట్‌లో ఇకపై AI బటన్‌తో కొత్త ఫీచర్‌ను లాంఛ్ చేయబోతోంది. ‘హలో జియో’ పేరుతో సెటప్ బాక్స్ కోసం అందుబాటులోకి టీవీ OS‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. అదేవిధంగా రిలయన్స్ షేర్స్ ఉన్న వాళ్లకు 1:1 నిష్పత్తిలో బోనస్‌గా షేర్లు ఇవ్వనున్నారు. కాగా, ఇటీవలే ఆయన తన వారసులకు కంపెనీల బాధ్యతలు అప్పగించారు. కూతురు ఈశా అంబానీకి రిటైల్, ఆకాశ్ అంబానీకి జియో, అనంత్ అంబానీకి ఎనర్జీ బిజినెస్ బాధ్యతలను కట్టబెట్టారు. అయితే, జియో చైర్మన్‌గా మరో ఐదేళ్ల పాటు ఆయనే కొనసాగనున్నారు.

Advertisement

Next Story

Most Viewed