రూ.4 లక్షల విలువైన టపాసులు సీజ్

by Sridhar Babu |   ( Updated:2024-10-27 15:27:42.0  )
రూ.4 లక్షల విలువైన టపాసులు సీజ్
X

దిశ,హుజురాబాద్ రూరల్ : ఎలాంటి అనుమతులు లేకుండా రూ.4 లక్షల 37 వేల విలువైన టపాసులు నిల్వ ఉంచగా వాటిని పోలీసులు సీజ్​ (Tapas seize)చేశారు. పట్టణంలోని చొక్కారపు యాదగిరి అనే వ్యాపారి దుకాణంలో వీటిని పట్టుకున్నట్లు టౌన్ సీఐ తిరుమల గౌడ్ (Town CI Tirumala Goud)తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సూపర్ బజార్ ఏరియాలో ఉన్న చొక్కారపు యాదగిరి కొన్ని సంవత్సరాలుగా టపాసులు విక్రయిస్తున్నాడు.

ఆయన దుకాణంలో అనుమతి లేకుండా టపాసులు నిల్వ ఉంచారని వచ్చిన సమాచారం మేరకు దుకాణంలో పోలీసులు తనిఖీ చేశారు. ఈ మేరకు ఎలాంటి అనుమతి లేకుండా రూ.నాలుగు లక్షల ముప్పై ఏడు వేల విలువగల క్రాకర్స్, టపాసులు దొరికినట్లు తెలిపారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన టపాసులను సీజ్ చేసి ఆయనపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. హుజురాబాద్ పట్టణంతో పాటు మండలంలోని ఏ గ్రామంలోనైనా అనుమతులు లేకుండా క్రాకర్స్ ,టపాసులు నిల్వ ఉంచితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Advertisement

Next Story