Tragedy: విషాదం... కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి

by srinivas |
Tragedy: విషాదం... కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లి మండలం సీతనగరం(Sitanagaram)లో విషాదం చోటు చేసుకుంది. పుష్కర‌ఘాట్‌ వద్ద కృష్ణా నది(Krishna River)లో మునిగి ఇద్దరు మృతి చెందారు. ఆదివారం కావడంతో హేమంత్ కుమార్, దుర్గా ప్రసాద్ స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగారు. కొంత సమయానికి నీటిలో మునిగిపోయారు. స్థానికులు గమనించి హేమంత్ కుమార్, దుర్గా ప్రసాద్‌ను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు విజయవాడ(Vijayawada) ఆరుణోదయనగర్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాని వాళ్లు కృష్ణా నదిలో దిగొద్దని, స్నానం చేయాలంటే పుష్కర్ ఘాట్ వద్ద అధికారులు సూచించిన ప్రాంతంలోనే చేయాలని పోలీసులు సూచించారు.

Advertisement

Next Story