- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
Tragedy: విషాదం... కృష్ణా నదిలో మునిగి ఇద్దరు మృతి
దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా(Guntur District) తాడేపల్లి మండలం సీతనగరం(Sitanagaram)లో విషాదం చోటు చేసుకుంది. పుష్కరఘాట్ వద్ద కృష్ణా నది(Krishna River)లో మునిగి ఇద్దరు మృతి చెందారు. ఆదివారం కావడంతో హేమంత్ కుమార్, దుర్గా ప్రసాద్ స్నానం చేసేందుకు కృష్ణా నదిలో దిగారు. కొంత సమయానికి నీటిలో మునిగిపోయారు. స్థానికులు గమనించి హేమంత్ కుమార్, దుర్గా ప్రసాద్ను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులు విజయవాడ(Vijayawada) ఆరుణోదయనగర్ వాసులుగా గుర్తించారు. మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈత రాని వాళ్లు కృష్ణా నదిలో దిగొద్దని, స్నానం చేయాలంటే పుష్కర్ ఘాట్ వద్ద అధికారులు సూచించిన ప్రాంతంలోనే చేయాలని పోలీసులు సూచించారు.