‘సీఎం పాలన ఆహా, ఓహో అని పారిపోయారు’

by srinivas |
‘సీఎం పాలన ఆహా, ఓహో అని పారిపోయారు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న వైసీపీ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా చురకలు వేశారు. ఆయన ట్వీట్ చేస్తూ.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్ కరోనా బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని గుర్తు చేశారు. బహుశా ఆయన పాలనపై ఉన్న నమ్మకమై ఉంటుందన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పూర్తి భిన్నమైన పరిస్థితి ఉందన్నారు.

టెస్టింగ్‌లో నెంబర్ 1, వైద్యం అద్భుతం అంటున్న వైసీపీ నాయకులు ఏపీలో చికిత్సకి ఎందుకు జంకుతున్నారని నిలదీశారు. ఏపీ సీఎం పాలన ఆహా, ఓహో అన్న ఎంపీ విజయసాయిరెడ్డి కరోనా పాజిటివ్ రాగానే హైదరాబాద్ ఎందుకు పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజలకి నాటు వైద్యం, మీ నాయకులకు కార్పొరేట్ వైద్యమా జగన్ రెడ్డి అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

Next Story

Most Viewed