ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఇక చిల్లరకు చెక్

by samatah |
ఆర్టీసీ సంచలన నిర్ణయం.. ఇక చిల్లరకు చెక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని పల్లెవెలుగు బస్సుల్లో నెలకొన్న చిల్లర సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్టీసీ యాజమాన్యం ముందుకు వచ్చింది. రౌండ్ ఫిగర్ రేట్లను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. దీంతో చాలా రూట్లలో చార్జీలు పెరగ్గా.. మరికొన్ని రూట్లలో తగ్గనున్నాయి. గతంలో టికెట్ ధరలు 12, 13 ఇలా ఉండేవి.. ఇక నుంచి రూ.12 ఉన్న చోట రూ.10, రూ.13 ఉంటే రూ.15 ఇలా రౌండ్ ఫిగర్ చేసి వసూలు చేస్తారు. పల్లెవెలుగు బస్సుల్లో చిల్లర సమస్య తలెత్తడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేగాకుండా, టోల్‌ప్లాజాల ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఆర్డినరీకి రూ.1, హైటెక్, ఏసీ బస్సులకు రూ.2 వసూలు అధనంగా వసూలు చేయనున్నారు.

Advertisement

Next Story

Most Viewed