ఆ రాక్షసత్వం చంద్రబాబుదే -బొత్స 

by  |
ఆ రాక్షసత్వం చంద్రబాబుదే -బొత్స 
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ది పొందాలనుకుంటున్న బీజేపీ అజెండాను చంద్రబాబు ఫాలో అవడం విడ్డూరంగా విందని మంత్రి బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

టీడీపీ పెద్దల అండతోనే ఆ పార్టీ కార్యకర్తలు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కేసులు పెట్టి వేధించే రాక్షసత్వం చంద్రబాబుదే తప్ప తమ ప్రభుత్వానిది కాదన్నారు. చంద్రబాబు చేసే ఆందోళన రాష్ట్రానికి ఏవిధంగా ప్రయోజనమో ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

సీఎం జగన్ ఏ పని చేసినా నిశ్చలంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఆలోచించి చేస్తారని చెప్పారు. విశాఖపట్నం ప్రజలంటే చంద్రబాబుకు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలోనే విశాఖ అభివృద్ధి చెందినట్లు బొత్స పేర్కొన్నారు.


Next Story

Most Viewed