బాలుడి ప్రాణం తీసిన పైపు..

by Sumithra |
బాలుడి ప్రాణం తీసిన పైపు..
X

దిశ, పాలకుర్తి : వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం శుభాష్ తండా (ఆర్‌ఆర్‌కాలనీ) గ్రామానికి చెందిన బాధవత్ ఈశ్వర్ (12) చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం బురాన్‌పల్లి గ్రామానికి చెందిన బోరుబండితో సోమవారం గ్రామ పల్లె ప్రకృతి వనంలో బోరు వేస్తున్న సమయంలో బోరు ఎయిర్ పైపు ఊడి సమీపంలో ఆడుకుంటున్న ఈశ్వర్ కు తగిలి నుదిటిపై తీవ్ర గాయం అయింది. చికిత్స కొరకు తొర్రూర్ క్రిష్ట ఆసుపత్రికి తీసుకెళ్ళారు.

అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం హన్మకొండ మాక్స్ కేర్ కు తరలించారు. ఈ నేపథ్యంలో మాక్స్ కేర్‌లో చికిత్స పొందుతూ ఈశ్వర్ మంగళవారం మృతిచెందాడు. తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు బోరుబండి యాజమాని వద్ద డబ్బులు తీసుకొని కేసు విషయంలో రాజీపడినట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed