జంటనగరాల్లో బోనాల జాతర.. అప్పుడే…

by Anukaran |
జంటనగరాల్లో బోనాల జాతర.. అప్పుడే…
X

దిశ. బేగంపేట: సికింద్రాబాద్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత సంవత్సరం కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా బోనాల సందడి జంటనగరాల్లో కనబడలేదు. కానీ ఈ సారి అలా కాకుండా జాతర ఏర్పాట్లు జరిగేలా ఉన్నాయి. అయితే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆలయ ఈవో మనోహర్ రెడ్డి, అర్చకులు ఆలయ ఫౌండర్ ఫ్యామిలీ సభ్యులు కామేష్ తదితరులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో సమావేశం జరిపారు. జూలై 25, 26 న బోనాల ఉత్సవాలపై మంత్రికి వివరించారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి త్వరలో ప్రభుత్వం తో మాట్లాడి జాతర ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేస్తామని హామి ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed