టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

by Shyam |
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
X

దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పోలీసులను అడ్డు పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు చేతకాని దద్దమ్మల్లా దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత సెగ తాకకుండా మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద పోలీసులు కాపలా కాస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం సంజయ్ ఓ ప్రకటన చేశారు. వరంగల్‌లో బీజేపీ కార్యాలయం, ఎంపీ ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడాన్ని నిరసిస్తూ తమ కార్యకర్తలు చేపట్టిన కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడాన్ని ఆయన ఖండించారు. కేసులు నమోదు చేసి భయపెట్టాలని చూడడం వారి క్రూర మనస్తత్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed