చైనీస్ ఫుడ్ తినొద్దు: కేంద్రమంత్రి

by Shamantha N |
చైనీస్ ఫుడ్ తినొద్దు: కేంద్రమంత్రి
X

న్యూఢిల్లీ: సరిహద్దులో భారత జవాన్ల మరణాలకు కారణమైన చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేంద్రమంత్రి రాందాస్ అథవాలే చైనీస్ ఫుడ్ తినొద్దని సూచించారు. చైనాను ఇరుకున పడేయడానికి పౌరులు చైనా ఉత్పత్తులను బహిష్కరించడంతోపాటు చైనీస్ ఫుడ్‌నూ తినడం మానేయాలని పిలుపునిచ్చారు.

చైనీస్ ఫుడ్‌ అమ్మే రెస్టారెంట్లు, హోటళ్లను మూసేయాలని, చైనీస్ ఫుడ్ తినేవారూ ఆ అలవాటును మానుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో అథవాలే ‘గో కరోనా, గో కరోనా’ అంటుండగా తీసిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

తాజాగా, ఆయన చేసిన సూచనలపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చైనీస్ ఫుడ్ సెంటర్‌లలో ఆ దేశ పేరు తప్పా వినియోగించే సరుకులు అన్ని ఇక్కడివేనని, వాటిని బహిష్కరిస్తే స్థానికంగా పనిచేసుకుంటున్నవారే నష్టపోతారని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed