కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది

by  |
కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోంది
X

దిశ, వెబ్‎డెస్క్:

దిశ వెబ్‎డెస్క్: కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ విమర్శించారు. అధికార పార్టీ తమ గొంతు నొక్కుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడం సరికాదని అన్నారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణలను బాల్క సుమన్ ఖండించారు.

అసెంబ్లీలో పార్టీ బలాన్ని బట్టి సమయం కేటాయిస్తారని.. దానికి టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేయడమేంటని అన్నారు. కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టికి మరల్చేందుకే కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని బాల్క సుమన్ అన్నారు. ఇక మరోవైపు పీవీ నరసింహారావుకు భారతరత్న రావడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదన్నారు.


Next Story

Most Viewed