రేపు కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన సదస్సు

by Sridhar Babu |
Parakala1
X

దిశ, పరకాల: భార‌త ప్రభుత్వ స‌మాచార ప్రసార మంత్రిత్వ శాఖ వ‌రంగ‌ల్ యూనిట్‌ ఆధ్వర్యంలో మ‌న దామెర మండ‌ల కేంద్రంలో గురువారం ఉద‌యం 10.30 గంట‌ల‌కు ప్రభుత్వ హై స్కూల్ ఆవ‌ర‌ణ‌లో జిల్లా స్థాయి అవ‌గాహ‌న కార్యక్రమం చేప‌డుతున్నారు. క‌రోనా వ్యాధి, కోవిడ్ వ్యాక్సినేష‌న్ ఆవ‌శ్యక‌త‌, ఏక్ భార‌త్ – శ్రేష్ట భార‌త్‌, ఆజాదీ కా అమృత్ మ‌హోత్సవ్ , స్వచ్ఛ భార‌త్ స‌హా కేంద్ర ప్రభుత్వ ఇత‌ర ప్రతిష్టాత్మక కార్యక్రమాల‌పై జిల్లా మ‌రియు మండ‌ల అధికారులు ముఖ్య అతిథులుగా విచ్చేసి అవ‌గాహ‌న క‌ల్పించ‌నున్నారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజ‌లు పెద్ద సంఖ్యలో విచ్చేసి విజ‌య‌వంతం చేయాల్సిందిగా దామర గ్రామ సర్పంచ్ గురిజాల శ్రీ రామ్ రెడ్డి గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు.

Next Story

Most Viewed