ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

by srinivas |
ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‎డెస్క్ :
ఏపీ పాలిసెట్‌-2020 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రసాదంపాడులోని సాంకేతిక విద్య కమీషనర్ కార్యాలయంలో శుక్రవారం విద్యాశాఖ కమీషనర్ ఎంఎం నాయక్‌ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏపీ పాలిసెట్‌ 2020లో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పాలిసెట్‌-2020 పరీక్షకు 88,372 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. అందులో 71,631 మంది పరీక్ష రాయగా.. 60,780 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 50,706 మంది పరీక్షలు రాయగా 42,313 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 20,925 మంది హజరవ్వగా.. 18,467 మంది ఉత్తీర్ణత పొందారు.

ఈ ఫలితాల్లో పశ్చిమ గోదావరికి చెందిన మట్టా దుర్గా సాయి కీర్తి తేజ 120 మార్కులతో మొదటిస్థానంలో నిలిచారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సుంకర అక్షయ ప్రణీత్ 119 మార్కులతో రెండో ర్యాంకు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సవిలత శ్రీదత్త శ్యామ సుందర్ 118 మార్కులతో మూడో ర్యాంకు సాధించారు.

Next Story