- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రజారోగ్యంతో వైసీపీ ప్రభుత్యం చెలగాటం

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రజారోగ్యంతో నాటి వైసీపీ ప్రభుత్వం చెలగాటం ఆడిందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జగన్ పై ఆరోపణలు చేశారు. జగన్ రెడ్డి వ్యవహారశైలి వంద ఎలుకలు తిన్న పిల్లి ప్రాయశ్చిత్తం కోసం కాశీ యాత్రకు వెళ్లినట్టుందని ఎద్దేవా చేశారు. మందుల సరఫరాదారులకు వెయ్యి కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళితే కూటమి ప్రభుత్వం చెల్లించిందన్న విషయం తెలీదా అని ప్రశ్నించారు. బకాయిలు పెట్టి, మందుల సరఫరాను ఆపి, పేదల ఆరోగ్యంతో ఆడుకున్నది వైసీపీ ప్రభుత్వం కాదా అని నిలదీశారు. గతంలో మీరు కమిషన్లకు పరిమితమైతే, అప్పులు చెల్లించి, పరిస్థితుల్ని చక్కదిద్ది ఇవాళ సంక్రమంగా మందుల్ని సరఫరా చేసి పేదల్ని కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నదని పేర్కొన్నారు. ప్రజారోగ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేనందునే ప్రజలు దారుణంగా తిరస్కరించారని, అయినా బుద్ధి రాలేదని మండిపడ్డారు. అసత్య ప్రచారాలు మాని ప్రజలు అలాంటి తీర్పు ఎందుకిచ్చారో ఆత్మ విమర్శ చేసుకోవాలని మంత్రి సత్యకుమార్ సూచించారు.