కడప జిల్లాలో దారుణం.. వెలుగులోకి సంచలన విషయాలు

by srinivas |   ( Updated:2024-10-19 12:03:27.0  )
కడప జిల్లాలో దారుణం.. వెలుగులోకి సంచలన విషయాలు
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా బద్వేలు సమీపంలో ఇంటర్ విద్యార్థినిపై యువకుడు విగ్నేశ్ పెట్రోల్ దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ సీరియస్ అయ్యారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరిస్థితిపైనా ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్‌ విద్యార్థినికి 80 శాతం గాయాలయ్యాయని తెలిపారు. చిన్నప్పటి నుంచి యువకుడు విగ్నేశ్‌తో విద్యార్థినికి పరిచయం ఉందని తెలిపారు. ఇద్దరూ బద్వేలు రామాంజనేయనగర్‌కు చెందిన వారేనని వెల్లడించారు. తనను కలవకపోతే చనిపోతానని బెదిరించడంతో ఇద్దరూ పీపీకుంట చెక్‌పోస్ట్‌ సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారని తెలిపారు. విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విగ్నేశ్ పరారయ్యాడని ఎస్పీ హర్షవర్ధన్ పేర్కొన్నారు.

Advertisement

Next Story