YS Sharmila: అది కేంద్ర బడ్జెట్ కాదు.. ఎన్నికల మెనిఫెస్టో: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

by Shiva |
YS Sharmila: అది కేంద్ర బడ్జెట్ కాదు.. ఎన్నికల మెనిఫెస్టో: వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్‌పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది కేంద్ర బడ్జెట్‌ కాదని.. ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం ఉంటుందని తాము ఆశించామని.. కానీ మరోసారి నిరాశ పరిచిందని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేవలం రూ.15 వేల కోట్లు ఎలా సరిపోతాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం పూర్తి చేసే బాధ్యత తీసుకుంటుందని చెప్పినా.. డైరెక్ట్‌ నిధులు మంజూరు చేస్తారు.. లేక తెచ్చే అప్పులకు కేంద్రం షూరిటీగా ఉంటుందా అనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు.

Read More..

AP News:‘అసెంబ్లీకి జగన్ అందుకే రావట్లేదు’..సంచలన విషయాలు బయటపెట్టిన సీఎం చంద్రబాబు?



Next Story