AP News:వైసీపీ కార్యకర్త దారుణ హత్య..స్పందించిన వైఎస్ జగన్

by Jakkula Mamatha |
AP News:వైసీపీ కార్యకర్త దారుణ హత్య..స్పందించిన వైఎస్ జగన్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ దుయ్యబట్టారు. పల్నాడు జిల్లా వినుకొండలో బుధవారం వైసీపీ పార్టీకి చెందిన కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై వైసీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతుంది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పై వైసీపీ ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతోంది. తాజాగా ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఈ క్రమంలో ఆయన తమ పార్టీని అణగదొక్కేందుకు దారుణాలకు పాల్పడుతున్నారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వినుకొండలో నడిరోడ్డుపై హత్య జరగడం ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. కొత్త ప్రభుత్వంలో ఏపీ హత్యలు, అత్యాచారాలు, విధ్వంసాలకు చిరునామాగా మారిందని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఏపీలో శాంతి భద్రతలు కరువైయ్యాయి అని పేర్కొన్నారు. రాష్ట్రంలో దిగజారిన పరిస్థితులపై పీఎం మోడీ, హోంమంత్రి అమిత్ షా దృష్టి పెట్టాలని కోరారు.



Next Story