‘చంద్రబాబు తెలంగాణకు వెళ్లిపోవడం ఖాయం’

by GSrikanth |
‘చంద్రబాబు తెలంగాణకు వెళ్లిపోవడం ఖాయం’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు టికెట్లు అమ్ముకొని చివరకు తెలంగాణకు వెళ్లిపోతారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవే చంద్రబాబు చివరి ఎన్నికలు అని.. ఓటమి తర్వాత రాజకీయాల నుంచి తప్పుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని సీరియస్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. ఆయన మాటలను నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజలు లేరని అన్నారు.

2015లో నమ్మి మోసపోయామని వారికి తెలుసని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు వైసీపీదే అని స్పష్టం చేశారు. అనంతరం మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. చంద్రబాబులా కుర్చీ లాక్కునే అలవాటు తనకు లేదని అన్నారు. తనపై విమర్శలు చేస్తున్న నేతలు.. ఆ లక్షణాలు మీ అధినేతకే ఉన్నాయని తెలుసుకోండని సూచించారు. చంద్రబాబు, దత్తపుత్రుడి మాటలను ప్రజలు నమ్మరని విమర్శించారు. వంద రోజుల్లోనే వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed