- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
విద్యుత్ సబ్ స్టేషన్లపై దాడికి దిగిన వైసీపీ నేతలు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : కర్నూల్ జిల్లాలో వైసీపీ నాయకుల ప్రధాన అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. స్థానిక ఎమ్మెల్యే విరూపాక్ష సోదరుడు, ఆయన అనుచరులతో కలిసి స్థానిక విద్యుత్ స్టేషన్లపై దాడికి దిగారు. ఆలూరు మండలంలోని మొలిగివలి, ఆస్పరి మండలంలోని జోహారపురంలోని సబ్ స్టేషన్లపై దాడి చేసి, అడ్డు వచ్చిన అధికారులను చితకబాదారు. కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎమ్మెల్యేకు ఎదురు సమాధానాలు చెప్తే ప్రాణాలు తీస్తామంటూ అధికారులను, సిబ్బందిని బెదిరించారు. కాగా దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
Next Story