- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > ఆంధ్రప్రదేశ్ > విజయనగరం > vizianagaram: లే ఆఫ్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ.. ఆందోళనలో కార్మికులు
vizianagaram: లే ఆఫ్ ప్రకటించిన ప్రముఖ కంపెనీ.. ఆందోళనలో కార్మికులు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లాలో స్మెల్ టెక్ ఫెర్రో అల్లాయిస్ కంపెనీ లే ఆఫ్ ప్రకటించింది. మెరకముడిదాం మండలం గర్భాంలో ఈ పరిశ్రమ ఉంది. పరిశ్రమకు నష్టాలు రావడంతో జులై 14 నుంచి లే ఆఫ్ ప్రకటిస్తున్నట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే ఈ పరిశ్రమకు విద్యుత్ శాఖ ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీలు పెంచింది. ఈ కారణంతో పాటు మార్కెట్ ధరలు తగ్గిపోవడంతో పరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఈ కంపెనీకు లే ఆఫ్ ఇస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. దీంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి కంపెనీకి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
Next Story