BREAKING: ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

by Satheesh |
BREAKING: ఏపీ సీఈవోగా వివేక్‌ యాదవ్.. ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఐఏఎస్ వివేక్ యాదవ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్థానంలో వివేక్ యాదవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఈవోగా వివేక్ యాదవ్ ఛార్జ్ తీసుకోగానే సీఈవో బాధ్యతల నుంచి ఎంకే మీనా రిలీవ్ కానున్నారు. ఎంకే మీనాకు చంద్రబాబు ప్రభుత్వంలో కీలక శాఖ అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలోనే జరిగిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed