Visakha: గాజువాక మహా గణపతిని దర్శించుకున్న పురందేశ్వరి

by srinivas |   ( Updated:2023-09-24 16:33:56.0  )
Visakha: గాజువాక మహా గణపతిని దర్శించుకున్న పురందేశ్వరి
X

దిశ, విశాఖపట్నం: గాజువాక లంకా మైదానంలో కొలువైన 107 అడుగుల పంచముఖ అనంత మహా గణపతిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఆమెకు నిర్వాహకులు, అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని, పక్కనున్న అనంత పద్మనాభ స్వామికి ఆమె పూజలు చేశారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ వినాయక చవితి అనగానే దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆనందోత్సవాలతో జరుపుకుంటారని చెప్పారు. ప్రజల్లో భక్తి భావం పెరుగుతోందని, ఆధ్యాత్మిక సేవ అన్నది అన్నింటికన్నా గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్ర, నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, కృష్ణంరాజు, గూటూరు శంకర రావు, బాటా శ్రీనివాస్, ఉత్సవ నిర్వాహకుడు కొశిరెడ్డి గణేష్ , రోహిణి, పావని తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed