‘పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది’

by GSrikanth |   ( Updated:2024-04-22 13:33:14.0  )
‘పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరుకుంది’
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరుకుందని అన్నారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. అసలు ఎన్నికల్లో పోటీకి పవన్ కల్యాణ్ అనర్హుడు అని ప్రకటించారు. సొంత ఫ్యామిలీకి, అభిమానులు, కార్యకర్తలకు న్యాయం చేయలేని వాడు రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. వివాహ బంధాన్ని హేళన చేశాడని మండిపడ్డారు. ప్యాకేజీల కోసం, చంద్రబాబు కోసమే పవన్ కల్యాణ్ పార్టీ పెట్టాడని అన్నారు. పవన్ కల్యాణే కాదు.. జనసేన తరపు పోటీ చేస్తున్న అభ్యర్థులంతా ఈ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. 2019 లో జనసేనకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో మళ్లీ అదే రిపీట్ కాబోతోందని తెలిపారు. బంపర్ మెజార్టీతో జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు.




Advertisement

Next Story