లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్రమంత్రి శ్రీనివాస్‌ వర్మ కీలక వ్యాఖ్యలు

by srinivas |
లడ్డూ వివాదంపై కేంద్రం సీరియస్.. కేంద్రమంత్రి శ్రీనివాస్‌ వర్మ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ వివాదం(Tirumala Laddu Controversy)పై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌(Union Minister Bhupathiraju Srinivas Varma) వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణల్లో నిజం ఉందని ఆయన తెలిపారు. లడ్డూ వ్యవహారంపై కేంద్రం సీరియస్‌గా ఉందనిఅవసరమైతే విచారణలో తనవంతు పాత్ర పోషిస్తుందని తెలిపారు. లడ్డూ వివాదంపై సిట్ విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమల ప్రతిష్టను దెబ్బ తీశారన్నారు. కల్తీ నెయ్యి అంశం నిజం, రిపోర్టులు వచ్చాయని, డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమల వెళ్లడం ఉల్లంఘనేనని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed