గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

by Sridhar Babu |
గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్
X

దిశ,సత్తుపల్లి : భద్రాచలం నుంచి గుంటూరుకు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన సంఘటన వీఎం బంజర్ లో శనివారం చోటుచేసుకుంది. సత్తుపల్లి ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వీఎం బంజర నుంచి విజయవాడకు వెళ్లే రహదారి మార్గంలో భద్రాచలం నుంచి గంజాయి తరలిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన మామిడి యేసు, బాపట్ల గ్రామానికి చెందిన చుక్క ఆనంద్ బాబును తనిఖీ చేయగా వారి బ్యాగులో 4.990 కేజీల గంజాయి లభించింది. నిందితులను అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై ఆర్.కిషన్, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, విల్సన్ సురేష్, భాస్కరరావు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed