ఏపీకి గుడ్ న్యూస్.. త్వరలో సీ ప్లేన్ కార్యకలాపాలు

by srinivas |
ఏపీకి గుడ్ న్యూస్.. త్వరలో సీ ప్లేన్ కార్యకలాపాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రజలకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయడు గుడ్ న్యూస్ తెలిపారు. రాష్ట్రంలో సీ ప్లేన్ కార్యకలాపాలను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. తొలి సీ ప్లేన్ డెమోను ప్రకాశం బ్యారేజీ నుంచి శ్రీశైలం వరకూ నిర్వహిస్తామని చెప్పారు. అలాగే రాష్ట్రంలో 7 కొత్త ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎయిర్ పోర్టుల సామర్థ్యాన్ని పెంచాలని ఇప్పటికే కేంద్రం కూడా నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. ఇందుకోసం శ్రీకాకుళం, అన్నవరం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్,కుప్పం, ఒంగోలు-నెల్లూరు, అనంతపురంలో స్థలాలను పరిశీలిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

Advertisement

Next Story