'భవ్యశ్రీకి న్యాయం చేయాలి'

by Vinod kumar |
భవ్యశ్రీకి న్యాయం చేయాలి
X

ప్రగతినగర్: భవ్యశ్రీ కి న్యాయం చేయాలంటు.. ప్రగతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ తీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన బాలిక (16) అనుమానస్పదంగ మరణించింది. వివరాల్లోకి వెళితే.. సెప్టెంబర్ 17వ తేదిన బయటకు వెళ్లి తిరిగి రాలేదు. తల్లితండ్రులు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్నరు. కానీ విచారణ జరుపలేదు.

నాలుగు రోజుల తర్వాత భవ్యశ్రీ ఓ భావిలో మృతదేహంగా కనిపించిడంతో పోలీసులు ఆత్మహత్యగా చెబుతున్నారు. ఈ కేసును తక్షినమే న్యాయమైన విచారణతో జరిపించాలని ప్రగతి యూత్ కోరుతున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు ప్రవీణ్, మార్క్స్, ధనుష్, ప్రియాంక మనోజ్, భగత్, వంశీ, రామ్ చరణ్, కార్తిక్, రక్షిత్, సుష్మ, రమ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed