జలపాతంలో పడి ఇద్దరు యువకులు గల్లంతు

by Mahesh |
జలపాతంలో పడి ఇద్దరు యువకులు గల్లంతు
X

దిశ, వెబ్‌డెస్క్: జలపాతం(waterfall)లో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాద సంఘటన అల్లూరి జిల్లా(Alluri District) అరకు లోయ(Araku Valley) సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విహార యాత్ర నిమిత్తం.. సరియా జలపాతం(waterfall) వద్దకు యువకులు వెళ్లారు. ఈ సమయంలో కాలుజారి వెంకట సాయి అనే యువకుడు జలపాతంలో పడిపోయాడు. ఇది గమనించిన దిలీప్ కుమార్ అనే యువకుడు వెంకటసాయి కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దిలీప్ కుమార్ కూడా జలపాతంలో పడి కొట్టుకుపోయినట్లు తెలుస్తుంది. కాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు స్థానికుల సహాయంతో సరియా జలపాతం లో గల్లంతైన యువకుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story