పవన్‌ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ జనసేన నేతలు.. కారణం ఇదే!

by Jakkula Mamatha |   ( Updated:2024-10-20 14:25:40.0  )
పవన్‌ కళ్యాణ్‌కు  కృతజ్ఞతలు తెలిపిన తెలంగాణ జనసేన నేతలు.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జనసేన నేతలు(Telangana Janasena leaders) నేడు(ఆదివారం) హైదరాబాద్(Hyderabad) సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌(Deputy CM Pawan Kalyan)కు యావత్ తెలంగాణ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) జనసేన పార్టీ(Janasena Party) అధ్యక్షుడు ఆర్.రాజలింగం మాట్లాడారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా తెలంగాణ తనకు పునర్జన్మనిచ్చిందని చెబుతుంటారని గుర్తుచేశారు.

పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేపట్టినా తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం(Kondagattu Anjaneyaswamy Temple) వద్ద పూజలు చేయడం సెంటిమెంట్‌గా మారిందని వివరించారు. ఏపీ ఎన్నికలకు ముందు వారాహి వాహనానికి సైతం కొండగట్టు హనుమాన్ దేవాలయం వద్దనే పూజలు నిర్వహించడం అందుకు నిదర్శనం వెల్లడించారు. కొండగట్టు అంజన్న ఆలయం వద్ద భక్తుల వసతి సౌకర్యం కోసం 100 గదుల నిర్మాణం కోసం టీటీడీ నుంచి నిధులు కేటాయించడం పవన్ కృషి వల్లే సాధ్యపడిందని తెలంగాణ జనసేన నేతలు స్పష్టం చేశారు.

Advertisement

Next Story