శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి

by Jakkula Mamatha |
శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి
X

దిశ, శ్రీశైలం: నంద్యాల జిల్లా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆలయ మర్యాదలు అనుసరించి ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకుని మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం నిర్వహించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో తులాభారం నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆలయ అర్చకులు, వేదపండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు శ్రీ స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.

Next Story