పిడిఎస్ బియ్యం, నల్లబెల్లం, పటిక పట్టివేత

by Naveena |
పిడిఎస్ బియ్యం, నల్లబెల్లం, పటిక పట్టివేత
X

దిశ, నూతనకల్ : పోలీసుల వాహనాల తనిఖీల్లో రెండు వేరువేరు చోట్ల పిడిఎస్ బియ్యం, నల్ల బెల్లం, పటిక పట్టుబడ్డాయని నూతనకల్ ఎస్సై మహేంద్రనాథ్ తెలిపారు. మండల పరిధిలోని బిక్కుమల్ల గ్రామ శివారులో మరిపెడ బంగ్లా నుంచి నూతనకల్ వైపు వస్తున్న.. బొలెరో వాహనంలో 30 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం స్వాధీనం చేసుకున్నమన్నారు. బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న మరిపెడ బంగ్లాకు చెందిన బుద్ధ శ్రీనివాస్ బొలెరో డ్రైవర్ బాదావత్ సురేష్ లను విచారించి కేసు నమోదు చేశామన్నారు. అలాగే నూతనకల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సూర్యాపేట నుంచి తుంగతుర్తి వైపు వెళ్తున్న ..ప్యాసింజర్ ఆటోలో దొనబండ తండాకు చెందిన లకావత్ హరి సింగ్, చిన్న గూడూరు కు చెందిన భూక్య మల్సూర్ల నుంచి 50 కేజీల నల్ల బెల్లం, 4 క్వింటాల పటికను స్వాధీనం చేసుకొని..కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed