కాపుల్లో ఒక్క నాయకుడు కూడా కనిపించలేదా?

by GSrikanth |
కాపుల్లో ఒక్క నాయకుడు కూడా కనిపించలేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: విజయనగరం ఎంపీ సీటు బీజేపీకి కేటాయించడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ డెంకాడ, నెల్లిమర్లలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ ఆవేదన వెళ్లగక్కారు. ఏజెంటు కూడా లేని బీజేపీకి విజయనగరం సీటుకేటాయించడంపై టీడీపీ నేతలు కంది చంద్రశేఖర్, పల్లె భాస్కరరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మా పార్టీ(టీడీపీ) కాపు సామాజికవర్గం గొంతు నులుముతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధిష్టానానికి తూర్పు కాపుల్లో ఒక్క నాయకుడు కూడా కనిపించలేదా? అని ప్రశ్నిస్తున్నారు. గ్లాసు, పువ్వు గుర్తులు పట్టుకొని తాము జనంలోకి వెళ్లలేమని బహిరంగ ప్రకటనలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed