తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేక అధికారులు

by Seetharam |
AP government
X

దిశ, డైనమిక్ బ్యూరో : మిచౌంగ్ తుపాను ప్రభావం రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 8 జిల్లాలు తుపాను ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి,డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలలో తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు భారీగా ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావిత జిల్లాలకు ప్రత్యేకాధికారులను రాష్ట్రప్రభుత్వం నియమించింది. బాపట్ల – కాటమనేని భాస్కర్‌, బి.ఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ – జయలక్ష్మి, తూర్పుగోదావరి – వివేక్‌ యాదవ్‌, కాకినాడ – యువరాజ్‌, ప్రకాశం – ప్రద్యుమ్న, ఎస్‌పిఎస్‌ నెల్లూరు – హరికిరణ్‌, తిరుపతి – జె.శ్యామలరావు, వెస్ట్‌గోదావరి – కన్నబాబు లను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Next Story